మార్కెట్లోకి రాఖీ కొనడానికి వెళితే చాలా రొటీన్ రాఖీలు కనిపిస్తాయి. ఇంకాస్త తీక్షణంగా పరిశీలిస్తే వాటిలో 50% రాఖీలు క్రిందటి సంవత్సరం అమ్ముడు పోని రాఖీలే. సోదరి ప్రేమతో కట్టిన రాఖీని ఒక రెండు రోజులు, మహా ఐతే వారం రోజులు మనతో పాటు ఉంటాయి, సోదరి ప్రేమ మనతో ఉన్నా రాఖీలు మనతో ఉండవు. ప్రేమ మాత్రమే కాదు దానికి సాక్షిగా నిలిచిన రాఖీ కూడా సోదరుడి దగ్గర ఉండాలనే ఉద్దేశ్యంతో మన హైదరాబాద్ కు చెందిన రంజనీ విశాల్ గారు ఇదిగో ఇలా Multi Purpose రాఖీలు తయారుచేస్తున్నారు.


దీపావళికి అందరు టపాసులు కాలుస్తారు, రంజాన్ మాసంలో వచ్చే హలీమ్ అందరం తీసుకుంటాం, క్రిస్మస్ వేడుకలకు కేక్ కటింగ్ లకు ఆత్మీయంగా ఏకమవుతాం. పండుగల వల్ల ఒక మతానికి మరొక మతానికి మధ్య స్నేహాన్ని బంధాన్ని పదిలం చేస్తుంది. రాఖీ పండుగ కూడా కులమతాలకు అతీతంగా జరిగే పండుగ. ఒకరికి మరొకరు రాఖీ కట్టాలంటే బంధుత్వమే అవసరం లేదు, మతం అవసరం లేదు, కనీసం ముఖ పరిచయం కూడా అవసరం లేదు. అంతటి శక్తివంతమైన ప్రేమనిండిన రాఖీలు కేవలం కొన్ని రోజులే మనతో ఉండకూడదని MBA పూర్తిచేసిన రంజనీ గారు ఓ స్టార్ ఆప్ మొదలుపెట్టారు. రంజనీ గారు ఇంకా తన మరిది ఇద్దరి కలిసి ఈ జ్ఞాపకాలను రూపొందిస్తున్నారు.



కస్టమర్స్ ఎవరికైతే ఈ స్పెషల్ రాఖీ కావాలో వారి బ్రదర్ ఫోటోను Whats App చెయ్యాల్సి ఉంటుంది. కస్టమర్స్ అభిరుచికి తగ్గట్టుగా తయారుచేసి పంపిస్తారు. ఈ రాఖీలు కూడా రూ.250 నుండి మొదలవుతాయి. రాఖీ పండుగ రోజు రాఖీగా ఆ తర్వాత రోజులు లాకెట్, కీచైన్ లుగా వాడుకోవచ్చు.


Contact them on WhatsApp here: 9490217005