ఆవిష్కృతమైన చిత్రాన్ని ప్రత్యూష గారు క్రెడిట్ అంతా తనదే అని ఒప్పుకోలేరు.. మదిలోని ఊహకు రూపం రావడానికి ఉపయోగపడ్డ పెన్సిల్ కు, దానిని మోస్తూ ఎన్నటికీ నిలిచిపోతున్న పేపర్ కు కూడా క్రెడిట్ ఇస్తారు, అందుకే తన ప్రతి ఫోటోలో చిత్ర రూపనకు ఉపయోగపడ్డ పెన్సిళ్లను ను జత చేస్తారు. ఇంతటి క్షుణ్ణమైన మనస్తత్వం గల ఆర్టిస్ట్ ఆర్ట్ ఎంత పరిపూర్ణంగా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. అసలు ఈ మార్గంలోకి రావడానికి గల ప్రధాన కారణమేమంటే అమ్మ నాన్నలిద్దరూ ఉద్యోగానికి వెళ్ళగానే ఇంట్లో ఒంటరిగా గడపడం ఇబ్బందిగా ఉండేది తనకు.. ఖాళీ సమయాన్ని బొమ్మలు వేయడానికి కేటాయించడంతో రాను రాను ఖాలక్షేపం కాస్త మనసుకి హాయినిచ్చే సమయంగా మారిపోయింది.. ఇందులో రొటీన్ గా కాకుండా ప్రత్యేకంగా చేస్తే అదే మనకు ప్రత్యేకతను తీసుకువస్తుందనే ఉద్దేశ్యంతో "చార్ కోల్" ద్వారా వేయడం నేర్చుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత కంప్యూటర్ మౌస్ కన్నా పెన్సిల్ మీదనే ప్రేమ మళ్లింది. ప్రత్యూష గారు ఇప్పటికీ దాదాపు 300 చిత్రాలు వేశారు. అందులో కొన్ని.. పూర్తి ప్రత్యూష గారి కోసం






























