మనిషిగా పుట్టడమే ఒక గొప్ప వరం. అలాంటి మనిషి తన జీవితం లో కనీసం లో కనీసం ఇరవైఐదు శాతం (25%) చదువుమీదే గడిపేస్తుంటాడు. అదే మనిషి ఒక గురువు అయితే ? తన జీవితం లో యాభై శాతం ఐనా Masters అని, Ph.D అని, స్టూడెంట్స్ కి చదువు చెప్పడం అని , ఇలా చదువు తోనే ఉండిపోతాడు. అంటే, మనిషి గా పుట్టిన ఒక గురువు తన జీవితం లో సగభాగం తన స్టూడెంట్స్ కి చదువు చెప్పడం తోనే ఉండిపోతాడన్నమాట ! ఇక్కడ గురువు అంటే మనకి పాఠాలు చెప్పేవాడే కాదు నడవడిక నేర్పేవాడు కూడా.
అక్షర జ్ఞానం తో పాటు సంస్కారం నేర్పేవాడే ఆచార్యుడు అవుతాడు. ఈరోజుల్లో మనకి ఆచార్యులు ఒక్కరంటే ఒక్కరు కనబడరు ఎక్కడోతప్ప ! ఒక స్వామీ వివేకానంద, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్, ఒక అబ్దుల్ కలాం లాంటి వారు పుట్టి, ఆచార్య వృత్తి కే పెద్ద గౌరవం తెచ్చిన ఈ నేల మీద అదే గురువు స్థానం లో ఉంటూ అందరినీ సిగ్గుపడేలా చేసిన వారూ లేకపోలేదు. దీనికి ఉదాహరణ నిన్న మొన్ననే ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం లో జరిగిన ఒక అవమానీయ ఘటన.
ఒక గురువు గా తన బాధ్యత తన స్టూడెంట్ ని చదివించడం. ఒక గురువు గా తన బాధ్యత తన స్టూడెంట్స్ కి చదువులో మెళకువలు చెప్పి సహాయం చెయ్యడం. ఒక గురువు గా తన బాధ్యత తన స్టూడెంట్స్ కి పాఠాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. ఒక గురువు గా తన బాధ్యత తన స్టూడెంట్ ని జీవితం లో పైకి తీసుకురావడం. కానీ ఒక గురువు గా తనకి, తన వృత్తి కీ సిగ్గుచేటు స్టూడెంట్స్ పట్ల అసభ్యం గా, నీచం గా ప్రవర్తించడం.
ఎక్కడో ఏ ఊర్లోనో కష్టపడి పనిచేసుకుంటూ, వారి పిల్లల్ని ఉన్నతమైన చదువు చదివించాలి అనే తపన తో ఎన్నో కష్టాలు పడి కాలేజీల్లో చేరుస్తారు తల్లిదండ్రులు. కారణం ? ఒక మంచి గురువు వీరికి చదువు చెప్పి పైకి తీసుకొస్తాడు అని. వారి పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని. తండ్రి తర్వాతి స్థానం లో ఉండే ఇతనికి ఇవన్నీ తెలీదు. ఆడదాని లో ఉన్న అందాన్నే ఇతను చూస్తాడు తప్ప ఒక గురు శిష్యుల అనుబంధం ఈయనికి తెలీదు. గురువు అని ఇలా ముసుగు తొడుక్కునే వాళ్ళు ఈదేశం లో కోకొల్లలు.
పోనిలే వదిలేద్దాం, ఎదో తప్పు చేసేసాడు అని అనుకుందాం? ఎలాగో దేశం లో ఎన్నో ఇలాగే వదిలేస్తున్నాం గా ... ! కానీ అతనికి అదే వయసు ఉన్న ఒక కూతురు ఉందే ! రేప్పొద్దున్న తన కూతురుకి కూడా ఇలా జరిగితే ఒక తండ్రి లా ఏం చేస్తాడు ఇతను ? పోనీ అదీ కాదు, ఇలా సిగ్గులేని పని చేసిన ఇతను, రేప్పొద్దున్న తన ఇంటికి వెళ్లి తన కూతురుకి తిన మొహం ఎలా చూపించగలడు ? విద్యార్థులు అందరూ వచ్చి తిరిగి ప్రశ్నిస్తే తనకున్న Doctorate లు చూపించగలడా ? "ఇదిగో నేను ఇంత గొప్ప, నాకు ఇక్కడ డిగ్రీ ఉంది, నేను ఇందులో Ph.D చేశా!" అని చెప్పుకుంటాడా కాబోలు ?
ఎంత కష్టపడి ఉంటారో, ఎన్ని సంవత్సరాలు తిండీ నిద్రలు మాని చదువుపైనే ధ్యాస పెడితే ఇంతటి స్థానం చేరి ఉంటారో, ఎన్ని పరీక్షలు రాసి ఉంటారో, కానీ ఎన్ని ఉన్నా ఒక్క సూర్య కిరణాలు లేకపోతే మొక్క వాడిపోయి, చచ్చిపోయినట్టే, ఎన్ని డిగ్రీలు ఉన్నా ఒక్క సంస్కారం మాత్రం లేకపోతే అన్నీ క్షణాల్లో ఆవిరైపోతాయ్. అంటే ఇక ఇప్పటివరకు బ్రతికిన బ్రతుకు అంతా వృధా ఏ అన్నమాట., ఎందుకంటే జీవితం లో సక భాగం ఈయన చదువు మీదే పెట్టేసారు కదా.
దీనికి కారణం ఏమైఉంటుంది ? మొక్కని మనం సూర్య కిరణాలు లేని చోట పెట్టి చచ్చిపోయిందీ అంటే మన తప్పే కదా! అలాగే ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు అలాంటివాడు, ఇలాంటివాడు అనే ముందు, అతనికి సంస్కారం ఎందుకు అబ్బలేదు అన్న విషయాన్నీ కూడా మనం ఆలోచించాలి. తన తల్లి మంచి మాటలు చెప్తున్నపుడు ఈయన పెడచెవిన పెట్టిఉండవచు లేదా తాను చదువు నేర్చుకున్న వాతావరణం అనువైనది కాకపోయిఉండచ్చు. మరి అలాంటప్పుడు అతన్ని గురువు గా ఎలా చూడగలం ఇంక? మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న పుడుతుంది . అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే ఎటువంటి సౌకర్యాలు లేనిచోటే గా చదువుకున్నదీ మరి ఇతనికి ఏమైంది అని.
ఎటువైపు నుంచి చూసినా, మనిషి తనకి తానూ గా సంస్కారాన్ని నేర్చుకోవాలి తప్ప, సెంట్ కొట్టుకున్నట్టు పైకి డీసెంట్ గా డిగ్రీలు, డాక్టరేట్లు అతికించుకుంటే రాదు. ఎక్కడో చూసా, ఈదేశం లో సినిమా హాలు లో గానానికి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు తప్ప ఆడదాని మానానికి లేదు అని. ముమ్మాటికీ నిజమ్. మనమే మన చేతులారా చేసుకుంటున్నాం. తప్పు చేసిన ఒక్కొక్కడిని కూర్చుని మేపుతుంటే, ఇంకా మేయడానికి ఇంకొన్ని పశువులు వస్తాయ్ తప్ప తప్పులు మాత్రం ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి.
ఆచార్య వృత్తి కి ఇలాంటి మచ్చ తెచ్చిన వాడిని చూసి కూడా ఆచార్యదేవోభవ అని ఎలా పిలవగలం ? అలా పిలవాలి అంటే ముందు మార్పు మనలోనే మొదలవ్వాలి. సినిమా హాలు కి వెళ్లి జన గణ మన కి నుంచొని, స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముసుగు కప్పుకొని పడుకుంటే ఏం లాభం ? All Indians are my Bothers and Sisters అని చెప్పి, చుసిన ప్రతీ అమ్మాయినీ కామెంట్ చేస్తే ఏం లాభం ? తప్పు చేసినవాడికి శిక్ష వెయ్యకుండా, కూర్చుని మేపితే ఏం లాభం ?